Advertisements

5th EVS{ TEST-18}చారిత్రక కట్టడాలు – వనపర్తికోట Part 4

Advertisements

చారిత్రక కట్టడాలు – వనపర్తికోట 

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

Historic monuments

Part 4

Vanaparthi Fort

వనపర్తి కోట – చరిత్ర

చిత్రంలో కనిపిస్తున్నదే వనపర్తి కోట(Vanaparthi Fort). ఇది మన రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో ఉంది. వనపర్తి హైదరాబాదుకు 150 కి.మీ. దూరంలో ఉంది. పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండేవి కనుక ఈ ప్రాంతానికి వనపర్తి అనే పేరు వచ్చింది.

Vanaparthi Fort

ఏ కోట ఎక్కడ ఉంది? ఎవరు నిర్మించారు?

కట్టడంజిల్లా నిర్మించినవారు
ఓరుగల్లువరంగల్కాకతీయులు
గద్వాలజోగులాంబసోమనాద్రి
గోల్కొండహైదరాబాద్కులీకుతుబ్ షా
రాచకొండనల్గొండరేచర్ల సింగమనాయకుడు
దోమకొండ కామారెడ్డికామినేని వంశస్థులు
భువనగిరియాదాద్రిత్రిభువన మల్లవిక్రమాదిత్యుడు
దేవరకొండనల్గొండరేచర్ల పద్మనాయకుడు
ఖమ్మం ఖిల్లాఖమ్మంకాకతీయ రాజులు
మెదక్ కోటమెదక్ప్రతాపరుద్రుడు
ఫలక్నుమాహైదరాబాద్సర్ వికార్ ఉల్ ఉమ్రా

వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనుం వీరకృష్ణా రెడ్డి. మొదట ఇతడు క్రీ.శ. 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవారు. తరవాత పాతపల్లికి దగ్గరలోని సూగూరులో కోట నిర్మించి, నివాసాన్ని సూగూరుకు మార్చారు. ఆనాటి నుండి దానికి “సూగూరు” సంస్థానం అనే పేరు వచ్చింది. ఆ సంస్థానం గోలకొండ సుల్తానులకు లోబడి సామంత రాజ్యంగా ఉండేది. గోలకొండను ఆనాడు సుల్తాన్ కులీ కుతుబుషా పాలిస్తుండేవారు. సంస్థానాధీశులను రెడ్డి రాజులు అని పిలిచేవారు.

పాతపల్లిలో ప్రారంభమైన సంస్థానం యొక్క రాజధాని సూగూరుకు అక్కడి నుండి పెద్దజనం పేటకు తర్వాత కొత్తకోటకు అక్కడి నుంచి శ్రీరంగపురానికి మారింది. రెడ్డి ప్రభువులలో ఒకరైన రామకృష్ణారావు క్రీ.శ. 1807లో శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చారు. అప్పటి నుండి సంస్థానము ఇండియన్ యూనియన్ లో విలీనమయ్యే వరకు వనపర్తి రాజధానిగా కొనసాగింది.

Vanaparthi Fort

వనపర్తి సంస్థాన రాజధానులు 

Vanaparthi Fort

Advertisements

మీకు తెలుసా!

 
• భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత సర్దార్ పల్లభాయి పటేల్ సంస్థానాలన్నింటిని ఇండియన్యూ నియన్ లో కలిపేశారు. మన రాష్ట్రంలో ఉన్న అన్ని చిన్న చిన్న సంస్థానాలన్ని కలిసిపోయాయి.
• దేశంలో చివరిగా విలీనమైనది నిజాం సంస్థానం.

సప్త సముద్రాలు

పేరు గ్రామం
1. శంకర సముద్రంకానాయపల్లి
2. రంగ సముద్రంశ్రీరంగపురం
3. వీర సముద్రంతాటిపాముల
4. మహభుపాల్ సముద్రంపెబ్బేరు.
5. కృష్ణా సముద్రంసంకిరెడ్డి పల్లి
6. గోపాల సముద్రంవెల్టూరు
7. రామ సముద్రంరాయిన్‌పేట

మీకు తెలుసా!

 
వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ నిర్మించారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే చెరువు నిండినపుడు గేట్లు వాటంతటవే తెరుచుకుంటాయి. దీన్నే “సైఫాన్ సిస్టమ్” అంటారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిదిగా పేరు పొందింది.

కళలు :

రెడ్డి ప్రభువులు చక్కని కళాభిరుచి కలవారు. వీరు నిర్మించిన భవనాల గోడలకు, పై కప్పులకు రంగులతో అనేక రకాల డిజైన్లు వేయించారు. అవి ఈనాటికీ చెక్కు చెదరలేదు. జర్మనీ నుండి సామగ్రిని, కళాకారులను తెప్పించి వీటిని రూపొందించారు. అది ఆనాటి కళావైభావానికి ప్రతీకగా చెప్పవచ్చు. వీరు సంగీతం, నాట్యం, హస్తకళలను కూడా ప్రోత్సహించారు.

 

దేవాలయాలు :

వనపర్తి రాజులు అనేక దేవాలయాలను కట్టించారు. వారిలో బహిరి గోపాలరావు తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగాపురంలో శ్రీరంగ నాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇది అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలిచింది. ఈ దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుచున్నది.

 

సాహిత్యసేవ :

రెడ్డి ప్రభువులలో బహిరి గోపాలరావు ఎనిమిది భాషలలో పాండిత్యం ఉండడంవలన ఆయనను “అష్టభాషాకోవిదులు” అని పిలిచేవారు. ఈ సంస్థాన ప్రభువులు అనేక మంది సాహిత్యపోషకులే కాకుండా స్వయంగా కవులు కూడా వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచార్యులు శతాధిక గ్రంధకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాలలో పాల్గొన్నారు. భ్రమరాంబికా సంవాదం రచించిన కడుకుంట్ల పాపశాస్త్రి, శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్ఛం గ్రంథాలు రాసిన అనుముల వేంకటసుబ్రమణ్యశాస్త్రి వనపర్తి సంస్థానం గొప్ప కవులుగా పేరుగాంచినవారు.

 

పరిపాలన

వీరి సంస్థానంలోని భూములను కొలిచి, వాటికి తగినట్లుగా పన్నులను నిర్ణయించేవారు. వీరు సంస్థానమును మూడు భాగాలుగా విభజించారు. అవి : 1. సూగూరు ప్రాంతం, 2. వనపర్తి ప్రాంతం, 3. కేశంపేట ప్రాంతం. ఈ ప్రభువులకు శక్తివంతమైన సైన్యం ఉండేది. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దులను ఈ సైన్యం సురక్షితంగా కాపాడుతూ ఉండేది.

మీకు తెలుసా!

 
సూగూరు సిక్కాలు : నిజాం రాజు సికిందర్‌షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు. ఈ నాణేలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటికే సూగూరు సిక్కాలు అని పేరు.

 

Vanaparthi Fort

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click the text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on the Next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know the right answer click on See Result
102
Created on

12.చారిత్రక కట్టడాలు - వనపర్తికోట part.4

1 / 15

రామకృష్ణారావుకు ముద్రించిన నాణేలకు ఉన్న పేరు ?

2 / 15

రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు  ముద్రించడానికి అనుమతినిచ్చిన నిజాం రాజు పేరు ?

3 / 15

ఏ రాజు రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు  ముద్రించడానికి అనుమతినిచ్చాడు?

4 / 15

శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్ఛం గ్రంథాలు రచించినది ఎవరు?

5 / 15

భ్రమరాంబికా సంవాదం రచించినది ఎవరు?

6 / 15

శతాధిక గ్రంథకర్త ఎవరు?

7 / 15

బహిరి గోపాల్ రావు ఎనిమిది భాషల్లో పాండిత్యం  ఉండడంవల్ల ఆయనను ఏమని పిలిచేవారు?

8 / 15

బహిరి గోపాల్ రావు ఎన్ని భాషల్లో పాండిత్యం కలవారు?

9 / 15

బహిరి గోపాల్ రావు శ్రీరంగాపురంలో ఏ ఆలయాన్ని నిర్మించారు?

10 / 15

బహిరి గోపాల్ రావు ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు?

11 / 15

సరళా సాగర్ యొక్క ప్రత్యేకత ఏమిటి?

12 / 15

సరళ సాగర్ చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకోవడంని ఏమంటారు?

13 / 15

సరళ సాగర్ చెరువు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో _________ లోనే మొట్టమొదటిదిగా పేరు పొందింది?

14 / 15

రెడ్డి ప్రభువులు భవనాల గోడలకు రంగులు వేయడానికి సామాగ్రిని, కళాకారులను ఎక్కడి నుండి రప్పించారు?

15 / 15

బహిరి గోపాలరావు ఏఏ ప్రదేశాలను సందర్శించి ఆలయాన్ని నిర్మించారు?

Your score is

The average score is 79%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి. 

ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here