Advertisements

💥ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు💥

Advertisements

 💥ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు💥

Government employee

 

Government employee

Government employee

❇️అంత్యక్రియలకు సాయం❇️

ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.20 వేలు అందిస్తారు. G.O.Ms.No.122, GA(SW) Department, Dt: 11.04.2016

ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు. 

✍ మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే చనిపోతారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించిన జీవోను 1987 జూన్‌ 23 రోజున జోవో నంబర్ 153 జారీచేశారు.

 

❇️ఎన్‌క్యాష్‌మెంట్‌❇️

మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజులు ఉంటే దానిని  300 రోజులకు పెంచారు. దీనికి సంబంధించిన జీవోను 2005 సెప్టెంబర్‌ 16 రోజున జీవో నంబర్ 232 జారీచేశారు.

❇️యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా❇️

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో చనిపోతే ప్రభుత్వం రూ.లక్ష (1,00,000) ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి జోవోను 2006 జూలై 7 రోజున జీవో నంబర్ 317  జారీచేశారు. 

❇️రవాణా చార్జీలు❇️

ఉద్యోగి విధి నిర్వహణలో కానీ..  మరే ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి అయిన ఖర్చు మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో నంబర్ 1669 చూడవచ్చు. 

❇️సస్పెన్షన్‌లో ఉంటే❇️

ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్నపుడు మరణిస్తే.. సస్పెన్షన్‌ విధించిన రోజు నుంచి చనిపోయిన రోజు వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారంతో పాటు ఇతర రాయితీలు కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ సమయంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.

❇️కారుణ్య నియామకం – కరువుభత్యం❇️

ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి DA (డీయర్‌నెస్‌ అలవెన్స్) ను కుటుంబ పెన్సన్‌ రూపంలో చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తంను రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో నంబర్ 89లో తెలుసుకోవచ్చు.

 ❇️సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే..❇️

విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చనిపోతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ. పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.

❇️ఫ్యామిలీ పింఛన్❇️

ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్‌ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్‌ వర్తిస్తుంది.

 

❇️చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు❇️

ఒక ఉద్యోగి తను పని చేసే సంస్థ ద్వారా తీసుకున్న అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని చనిపోయి ఉంటే ఆ మొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్(GPF)‌తో సమానమైన రూ.10 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.

❇️రిఫండ్‌❇️

ఉద్యోగి సర్వీస్ లో ఉన్న అప్పుడు ఆ ఫ్యామిలీకి బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తం  రూపాయలు ఆ ఉద్యోగి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో నంబర్ 307తో పాటు 1983 ఏప్రిల్‌ 27నజారీ చేసిన జీవో  నంబర్ 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.

 

 

పైన ఉన్న సమాచారం pdf లో కావాలంటే కింద నొక్కండి

 

 👉To Join Our Telegram group

 👇👇👇👇👇

CLICK HERE

👉To Join Our Whatsapp group

👇👇👇👇👇

CLICK HERE

👉To Subscribe Our youtube channel

👇👇👇👇👇

CLICK HERE

 

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here